Vinayaka Chaviti Celebrations: ఏపిలో గత రెండు రోజుల నుండి గణేష్ ఉత్సవాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు గణేష్ ఉత్సవాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలు పాటిస్తూ వినాయక మండపాల్లో పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందనీ, నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పూజలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది, ఒకే సారి అయిదుగురు ఉంచకండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. అయితే పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా కేంద్ర ప్రభుత్వ కోవిడ్ గైడ్ లైన్స్ మేరకు రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. మరో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డి లు ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలు నేడు నిర్వహించిన ర్యాలీలు, బహిరంగ సభల వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వీరిపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. వీరి వందలాది మందితో వీరు ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటే లేని నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఎందుకని వారు ప్రశ్నించారు.
ఇక్కడ చూడండి @ysjagan గారూ!
సరిగ్గా గంటక్రితం మీ సొంతజిల్లాలోని ప్రొద్దుటూరులో స్థానిక మీ MLA ,MP ల ఆధ్వర్యంలో,MPలు,MLAలు మీ ప్రియతమ సలహాదారులు @SRKRSajjala గారి సమక్షంలో వేలాదిమందితో ఇలా రోడ్ల మీద ర్యాలీలు చేసుకుంటూ,మీటింగులు పెట్టుకోవచ్చా?హిందువులు (1/2)
| @YSRCParty pic.twitter.com/1zzFLGfS0T— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 8, 2021