AP High Court: కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఏపిలో ప్రభుత్వ అధికారుల తీరు కనబడుతోంది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఉన్నతాధికారులకు ఉన్నా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చర్యలు తీసుకోకపోతే హైకోర్టు నుండి చివాట్లు తినాల్సి వస్తోంది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు అంశంపై ఏపి హైకోర్టు మంగళవారం ప్రభుత్వంపై మండిపడింది. ఈ నెల 15వ తేదీ లోగా చెల్లించకపోతే కోర్టు దిక్కార చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరిక జారీ చేసింది.
రెండు వారాల క్రితం 494 కేసులలో చెల్లింపులు చేయమని ఆదేశిస్తే కేవలం 25 కేసులలోనే చెల్లించడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్పంచ్ ఎకౌంట్ లోకి వెస్తే వారు కాంట్రాక్టర్ కు చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వారి వివరాలు ఇస్తే వారిపైనా కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. కొన్ని కేసులలో విచారణ జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు విచారణ ఏమిటి, విచారణ చేపడితే పిటిషనర్ లకు నోటీసులు ఇచ్చారా అని కోర్టు ప్రశ్నించింది. 20 నుండి 30 శాతం చెల్లింపులను కట్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎవరికి ఎంత చెల్లించారో వివరాలు ఈ నెల 15వ తేదీలోగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Read More:
1.AP Govt: ఇది జగన్ సర్కార్ కు భారీ ఊరట..! హస్తినలో మంత్రి బుగ్గన ప్రయత్నాలు ఫలించినట్లే..!!
2.Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?
3.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!