Ap high court : ఏపిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఎస్ఈసీ హౌస్ అరెస్ట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కి హైకోర్టు లో ఊరట లభించింది. ఎస్ ఈ సీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.
ఈ నెల 21 వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలంటూ ఎస్ ఈ సీ నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. ఈ మేరకు డిజిపిని ఎస్ ఈ సీ ఆదేశించింది. ఎస్ ఈ సీ ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆదివారం విచారణ జరిపింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవని పేర్కొన్న హై కోర్ట్ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?