AP High Court: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏపీ సీఐడి నమోదు చేసిన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇంటీరియమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీకి పిర్యాదు చేసిన నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ సహా మరి కొందరు వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తొంది. దీంతో నారాయణతో పాటు లింగమనేని బ్రదర్స్, రామకృష్ణ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మాజీ మంత్రి నారాయణపై ఒక పక్క టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసు, మరో పక్క ఇన్నర్ రింగ్ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతో నారాయణపై కేసులు నమోదు చేశారని టీడీపీ ఆరోపిస్తుండగా. అధికార పక్షం సమర్ధిస్తూ వారి వాదనను వెల్లడిస్తొంది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణకు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేయగా, నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై చిత్తూరు కోర్టు లో విచారణ జరుగుతోంది. అటు టెన్త్ పరీక్షా పత్రాల కేసులో బెయిల్ లభించడం, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం నారాయణకు రిలీఫ్ లభించినట్లు అయ్యింది.