ఏపి ఆర్ధిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. విద్యా శాఖకు సంబంధించిన బిల్లుల విడుదలలో ఆర్ధిక శాఖ జాప్యం చేస్తున్నారని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ ల తరపున న్యాయవాది అంబటి సుధాకర్ రావు వాదించారు.
అయితే ఈ విచారణకు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హజరైయ్యారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ హాజరు కావాల్సి ఉండగా, ఆయన గైర్హజరు అయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ