NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రలో తాము పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతూ పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా అని ప్రశ్నించింది. పిటిషన్ లో పార్టీ కాని వారు అప్పీల్ ఎలా దాఖలు చేస్తారని రైతు పరిరక్షణ సమితిని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పిటిషన్‌ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడం, తమ నిరసనను తెలియచేసే ప్రాధమిక హక్కును ఉపయోగించడమేనని అన్నారు.

AP High Court

 

రాజధాని అమరావతిలోనే ఉండాలని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని న్యాయవాది ఆదినారాయరావు తెలిపారు. మూడు రాజధానుల బిల్లు మళ్లీ తెస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందన్నారు. పాదయాత్రకు పోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాళ్లకు లేని ఆంక్షలు రైతులకు మాత్రమే ఎందుకని న్యాయవాది అన్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మూడు రాజధానులకు అనుకూలంగా, మరో వైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్రలు చేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Breaking: అమరావతి రాజధాని కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. వేరే బెంచ్ కు బదిలీ

పాదయాత్ర అంశంపై సింగిల్ జడ్జ్ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే సింగిల్ జడ్జ్ లు ఇరువురు తమ ఉత్తర్వులు వెల్లడించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బాధిత పక్షం కోర్టుకు రావాలి కానీ వేరే వాళ్లు అప్పీలుకు రావడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. అయితే తాము బాధితులకు సంఘీభావం తెలిపేందుకే పిటిషన్ వేశామని పిటిషనర్ తరపున న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు.  రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సవివరంగా కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk