AP High Court: ఉద్యోగుల జీతాల నుండి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్యానించింది. ఏపి సర్కార్ గత నెలలో విడుదల చేసిన పీఆర్సీ నూతన జీవోలపై దాఖలైన పిటిషన్లపై ఏపి హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగులు వేసిన పిటిషన్ పై కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీ విషయంల ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషన్లకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Read More: TDP: పులివెందుల టికెట్ పంచాయతీని తేల్చేసిన చంద్రబాబు..! చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ ఇదీ
AP High Court: జేఏసి నేత పిటిషన్ పై ..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపి గెజిటెడ్ అధికారుల జేఏసి అధ్యక్షుడు కేవి కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపి ప్రభుత్వం, ఆర్ధిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏ ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయవద్దని ఆదేశాలు చేస్తూ ఈ రోజుకు విచారణ వాయిదా వేసింది. ఈ రోజు కూడా మరో సారి జీతంలో రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ హైకోర్టు హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Read More: YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?