MP RRR Case: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజును తక్షణం జిల్లా జైలు నుండి రమేష్ ఆసుపత్రికి పంపించాలని ఏపి హైకోర్టు ఆదేశించింది. ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి మెడికల్ బోర్డు నివేదిక జిల్లా కోర్టు నుండి అందిన నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్ బోర్డుతో పాటు రమేష్ ఆసుపత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఐడి కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
పోలీసులు రఘురామకృష్ణం రాజును జీజీహెచ్ నుండి రమేష్ ఆసుపత్రికి తరలించకుండా నేరుగా గుంటూరు జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సీఐడీ కోర్టు ఆదేశాలను పోలీసులు పాటించాలని, తక్షణం ఆయనను రమేష్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు మరి కొద్ది సేపటిలో రానున్నాయి.
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించారని తదితర సెక్షన్ ల కింద ఏపి సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణంరాజును మొన్న 14వ తేదీ అరెస్టు చేసిన సంగతి విదితమే.