AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ ల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతోంది. ఇప్పుడు తాజాగా మరో షాక్ ఎదురైంది. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంగతి సంగతి, అయితే పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారుల నుండి వత్తిడి వస్తున్న నేపథ్యంలో 128 మంది లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సెంటు సెంటున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనీ, అగ్ని ప్రమాదాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలు ఎదురవుతాయని హైకోర్టు అభిప్రాయపడింది.
AP High Court: ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించవద్దు
పేదల కు ప్రభుత్వం స్థలాలు పంపిణీ చేయడానికి హైకోర్టు వ్యతిరేకం కాదని పేర్కొంటూ భవిష్యత్తు లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై మూడు విభాగాల అధికారులతో ప్రభుత్వం కమిటీ ద్వారా అధ్యయనం జరిపిన తరువాత వారు ఇచ్చే నివేదిక ప్రకారం ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. లబ్దిదారులను ఇళ్ల నిర్మాణం కోసం వత్తిడి చేయవద్దని పేర్కొన్న ప్రస్తుతం ఆ స్థలాల్లో నిర్మాణాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు జివోలను హైకోర్టు రద్దు చేసింది.
నిర్మాణాలకు లబ్దిదారుల విముఖత
జగన్మోహనరెడ్డి సర్కార్ నవరత్న పథకాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లు ఇచ్చింది. అయితే చాలా ప్రాంతాల్లో సెంటు, సెంటున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కు లబ్దిదారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అధికారులు వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ తరుణంలో ఏపి హైకోర్టు కీలక తీర్పు వెలవరించింది. దీనిపై ఏపి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
read More:
3. BJP: ఏపి బీజేపీపై అధిష్టానం సవతి తల్లి ప్రేమ..! ఇదిగో మూడవ ఫ్రూఫ్..!!