AP High Court: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ ప్రవేశాలపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. సరైన విధానాన్ని ప్రకటించలేదని తెలిపారు వాదనలు విన్న హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సంవత్సరం ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు దశల్లో దరఖాస్తులను స్వీకరించింది. మొదటి విడతలో ఆగస్టు 27వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. రెండవ విడతలోనూ ప్రవేశాలను ప్రారంభించిన ఇంటర్ బోర్డు నవంబర్ ఆరువ తేదీ వరకు తుది గడువు గా ప్రకటించింది. అయితే సరైన విధివిధానాలు లేకుండా ఆన్ లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారనీ పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన హైకోర్టు..ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆన్ లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..
1.supreme Court: సీబీఐకి సుప్రీం కోర్టు అక్షింతలు..!!
2.Vellampalli Srinivas: వినాయక చవితి వేడుకలపై మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!
3.Manchu Manoj: ఏపి సీఎం సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీనటుడు మంచు మనోజ్..! కలయికపై ఏమన్నారంటే..?