స్థానిక ఎన్నికల ప్రక్రియపై ఏపి హైకోర్టు నేడు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను ప్రభుత్వం ఎస్ఈసీ వద్దకు పంపించాలనీ, ఇందు కోసం ఎన్నికల కమిషనే వేదికను నిర్ణయించాలనీ హైకోర్టు సూచించింది. ఏస్ఈసీలో చర్చలు జరపాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు మూడు రోజులు డెడ్ లైన్ విధించింది.
ఈ సమావేశంలో ఎన్నికలపై ఉన్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎస్ఈసీ ముందు ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఎస్ఈసీ వివరించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్నది.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.