తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి ఏపి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఓ కేసు విచారణకు సంబంధించి కోర్టు దిక్కరణకు పాల్పడినందుకు గానూ జైలు శిక్ష, జరిమానా విధించింది ఏపి హైకోర్టు. టీటీడీకి సంబంధించి ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టు ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం రోజులు అదనంగా జైలు శిక్ష విధించేలా తీర్పు ఇచ్చింది.
ఏపి కేబినెట్ ఆమోదించిన కీలక అంశాలు ఇవే..వాళ్లకు గుడ్ న్యూస్