AP High Court : ఏపిలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 8వ తేదీ పోలింగ్, పదవ తేదీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 1వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ జనసేన, బీజేపీ,టీడీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ లు దాఖలు చేశాయి. పిటిషన్ లను హైకోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మొన్న తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ నెల 1వ తేదీన ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల సమయం ఉండాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పాటించలేదని ఏపి హైకోర్టు వ్యాఖ్యానించింది.