AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని రాజీవ్ స్వగృహకు ఇచ్చిన భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్ స్వగృహకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. వైసీపీ సర్కార్ రాజీవ్ స్వగృహ భూముల వేలానికి సిద్ధం అయ్యింది. మొత్తం 25 ఎకరాలను విక్రయించేందుకు ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని వేలం ఏమిటంటూ రామకృష్ణ బాబు తరపు న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ప్లాట్ల వేలం వేయడానికి వీలులేదంటూ స్టే ఇచ్చింది.