AP High Court: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై నమోదు అయిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులో తదనంతర చర్యలపై ఏపి హైకోర్టు స్టే ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ లో రఘురామ కృష్ణంరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు అయ్యింది. సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై కేసు నమోదు చేశారంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంపై రఘురామ హైకోర్టును ఆశ్రయించారు.
AP High Court: ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు స్టే
రఘురామ ఎలాంటి దూషణలు చేయకపోయినా, సాక్షాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ రఘురామ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు తదనంతర చర్యలను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. దీంతో రఘురామకు ఎస్సీ, ఎస్టీ కేసులో ఊరట లభించినట్లు అయ్యింది. సంక్రాంతి పండుగకు ముందు రఘురామకు సీఐడీ అధికారులు విచారణ రావాలంటూ నోటీసు అందజేశారు. నోటీసు అందుకున్న తరువాత రఘురామ మీడియా సమావేశంలో సీఐడీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తరువాత ఆయనపై ఎస్సీ, ఏస్టీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.