AP Inter Results: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 54, సెకండ్ ఇయర్ 61 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఉమ్మడి కడప జిల్లా 55 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప విద్యార్ధులు ఉత్తీర్ణతా శాతంలో చాలా వెనుకబడి షాక్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏప్పుడూ మాదిరిగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Inter Results: రికార్డు స్థాయిలో 28 రోజుల్లో ఫలితాలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 2,41,591 మంది పాస్ అవ్వగా, సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది పాస్ అయ్యారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హజరు కాగా జవాబు పత్రాల మూల్యాకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు జూన్ 25వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆగస్టు 3 నుండి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్ ఫలితాలను Https://emamresults.ap.nic.in లేదా www.bie.ap.gov.in వైబ్ సైట్లలో చూసుకోవచ్చు.