AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్ష ఫలితాలను examresults.ap.ac.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపిలో ఇంటర్ పరీక్షలను మే 5వ తేదీన నిర్వహించేందుకు తొలుత ఇంటర్ విద్యామండలి షెడ్యుల్ విడుదల చేసినా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంల పరీక్షలను వాయిదా వేసింది. తరువాత జులై మొదటి వారంలో నిర్వహించాలని భావించింది. ఆ తరువాత కరోనా నేపథ్యంల పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించమని సుప్రీం కోర్టు తెలియజేస్తూ పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జూలై 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి సాధ్యం కానందున ఏపి సర్కార్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.