ఏపి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఆగస్టు 3 నుండి 12వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరిక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 1022 సెంటర్ లలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 429 మాల్ ప్రాక్టీసు కేసులను నమోదు చేశారు. ఇక ఉత్తీర్ణత శాతం విషయానికి .. ఈ పరీక్షలకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్ధులు హజరైయ్యారు. వీరిలో 70.63 మంది ఉత్తీర్ణులయ్యారు. వస్తే ఫస్ట్ ఇయర్ లో జనరల్ విభాగంలో 35 శాతం పాస్ కాగా , వొకేషనల్ లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో జనరల్ విభాగంలో 33 శాతం, వొకేషనల్ లో 46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ (resultsbie.ap.gov.in) లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో మొత్తం 68 శాతం మంది, సెకండ్ ఇయర్ జనరల్ విబాగంలో 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్ విభాగంలో ఫస్ట్ ఇయర్ లో మొత్తం 66 శాతం మంది, సెకండ్ ఇయర్ లో 80 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. మొత్తం గా అన్ని విభాగాలను పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇంటర్ మొత్తం 70.63 శాతం ఉత్తీర్ణత సాధించారు.