ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 మార్చి 15వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపి ఇంటర్ బోర్డు షెడ్యుల్ ను విడుదల చేసింది.

మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నుండి మే రెండో వారం వరకూ ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి.