AP legislative Council: ఏపి శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన 11 మంది సభ్యులతో మండలిలో వైసీపీ బలం 32కి చేరింది. విజయనగరం నుండి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుండి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తూర్పు గోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్, కృష్ణాజిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురాం, గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుండి తుమాటి మాధవరావు ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా నుండి భరత్, అనంతపురం జిల్లా నుండి ఎల్లారెడ్డిగారి శివరామి రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు.
Read More: Sasikala Meets Rajinikanth: సూపర్ స్టార్ రజనీతో శశికళ భేటీ..! ఆ రెండు కారణాలు..!!
AP legislative Council: పరిపాలనా వికేంద్రీకరణపై దేశ విదేశాల్లో చర్చ
ఈ సందర్భంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వరుసగా రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం వై ఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన రెడ్డి సర్కార్ తీసుకువస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ గురించి దేశ విదేశాలలో చర్చించుకుంటున్నారన్నారు. ఇప్పుడు మండలిలో వైసీబీ బలం 32కి చేరిందన్నారు. మండలిలో టీడీపీ ఎలా వ్యవహరించిందో అందరూ చూశారన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న నిర్ణయాలను మండలి ద్వారా ప్రజలకు చేరవ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read More: BJP: రేపు అమిత్ షాతో బండి సంజయ్ బృందం భేటీ..! ఎందుకంటే..?