AP Legislative Council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్సరాలు జరుగుతుండగా టీడీపీ సభ్యులు తాళి బొట్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్ష నేతలు తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు మహిళల అత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వైసీపీ మహిళా సభ్యులు పోతుల సునీత, కళ్యాణి, కల్పలతారెడ్డి టీడీపీ సభ్యుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి చేతిలో నుండి పోతుల సునీత తాళిబొట్టు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సభకు కొద్ది సేపు వాయిదా వేసి మళ్లీ ప్రారంభించారు. ఆ తరువాత కూడా టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో చైర్మన్ మోడేష్ రాజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బచ్చుల అర్జునుడు, రాజనర్శింహులు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు.