Ap Local Body Elections: రాష్ట్రంలో వైెఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు వాలంటీర్లు అధికార పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు కూడా. వాలంటీర్లు అత్యధికంగా అధికార పార్టీకి అనుకూలమనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వాలంటీర్ టీడీపీ తరపున పోటీ చేస్తుండటం ఆ జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
Read More: Kuppam municipal election: పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు…! కుప్పంలో హీట్ ఎక్కిన రాజకీయం…!!
Ap Local Body Elections: అనంతలో మొదలైన ఎన్నికల సందడి
వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా పెనుగొండ నగర పంచాయతీలోని 20 వార్డులు, అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్, రాయదుర్గం మున్సిపాలిటీలోని ఒకటో వార్డుతో పాటు చిలమత్తూరు జడ్ పీటీసీ, 16 ఎంపీటీసీలు, నాలుగు సర్పంచ్, 175 వార్డులకు ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల అభ్యర్ధులు సన్నద్దం అయ్యారు. ఆయా పార్టీల స్థానిక నేతలు అభ్యర్ధులను ఖరారు చేయడం కూడా జరిగింది. అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
పెనుగొండ ఎన్నికల బరిలో మహిళా వాలంటీర్
కాగా పెనుగొంగ నగర పాలక పంచాయతీ ఎన్నికల బరిలో గ్రామ మహిళా వాలంటీర్ సబీరాబాను టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగారు. మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి సమక్షంలో ఆమెకు పార్టీ బీ ఫారం అందుకున్నారు. తాను 8న వార్డు నుండి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు వాలంటీర్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాలంటీర్లు ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్ లుగా, ఎంపీటీసిలుగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వాలంటీర్ ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగడం విశేషం.