Adimulapu Suresh: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల ఉదృతి కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో థర్డ్ వేవ్ వచ్చినట్లుగానే భావిస్తున్నారు. దేశంలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉదృతి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో రోజు వారి కేసులు 2 వేలకు పైగా ఉండగా, ఏపిలో 5వేల వరకూ చేరాయి. ఈ తరుణంలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. పాఠశాలల సంక్రాంతి సెలవులు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ సెలవులను పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Read More: Chandrababu: చంద్రబాబుకి హెల్ప్ చేసిన సాక్షి పత్రిక ఆర్టికల్..వింతలకే వింత ఇది..!
Adimulapu Suresh: పాఠశాలల సెలవుల పొడిగింపు లేదు
ఈ నేపథ్యంలో ఏపీలోనూ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తారని, దీనిపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రచారంపై ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఏపిలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ అదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. మాస్క్ లు ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Read More: Panjab Elections: ఈసీకి పంజాబ్ సీఎం కీలక సూచన..! ఈసీ ఆ సూచన ఆమోదిస్తుందా..?