AP Inter Results: ఏపి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశార. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://examresults.ap.nic.in లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను 4,33,275 మంది విద్యార్ధులు రాయగా, ఇంటర్ ద్వితీయ పరీక్షలను 3,79,758 మంది విద్యార్దులు రాశారని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61 శాతం, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధమ స్థానంలో కృష్ణా
ఇంటర్ లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రధమ స్థానంలో ఉండగా, 46 శతం ఉత్తీర్ణతతో కడప జిల్లా అఖరి స్థానంలో ఉందని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకూ పరీక్షలు నిర్వహించగా, పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు విడుదల చేసింది. అయితే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో బాలికలే సత్తా చాటారు.
YS Viveka Murder Case: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు ..సునీతకు మద్దుతుగా