AP Minister Buggana Rajendranath Reddy: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, చేస్తున్న అప్పులపై టీడీపీ పదేపదే శ్రీలంక తో పోలుస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న విమర్శలపై ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష టీడీపీ బులిటెన్ ఇవ్వడం శోచనీయమని అన్నారు బుగ్గన. ఆర్ధిక అంశాలలో అనుభవజ్ఞుడైన యనమల ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణ బాగుందని కాగ్ చెప్పిందన్నారు బుగ్గన.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపి అగ్రభాగంలో ఉందని చెప్పిన మంత్రి బుగ్గన .. ప్రస్తుత ఏడాదికి 2.10 శాతం మాత్రమే ద్రవ్యలోటు ఉందని అన్నారు. ఏపి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి బ్యాంకుల నుండి రుణాలు రాకుండా చేయాలన్న దుర్బద్ధితో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి బుగ్గన. గత ప్రభుత్వ హయాంలో 19.50 శాతం మేర అప్పులు పెరిగితే .. వైసీపీ ప్రభుత్వ హయాంలో 15.5 శాతం మాత్రమే అప్పులు పెరిగాయని అన్నారు. డీబీటీ కింద రూ.1.40 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. నాన్ డీబీటీ ద్వారా సుమారు రూ.44వేల కోట్లు లబ్దిదారులకు చేరిందన్నారు మంత్రి బుగ్గన. నెట్ బారోయింగ్ సీలింగ్ విషయంలో రుణ పరిమితిని పెంచుకోవడానికి కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఎగుమతులు, పరిశ్రమలు, పథకాలు, పన్నుల వసూళ్లలో గతంతో పోలిస్తే ఏపి అత్యున్నత స్థానంలో ఉందని మంత్రి బుగ్గన వివరించారు. ఉద్యోగుల ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఆలస్యమైన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు మంత్రి బుగ్గన. ఉద్యోగుల జీతాల విషయంలో జాప్యం జరగడం లేదని తెలిపారు మంత్రి బుగ్గన. ప్రతి దానికీ శ్రీలంకతో పోలుస్తున్నరని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?