రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి మహా పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో వికీంద్రీకరణకు అనుకూలంగా పాదయాత్రలు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. మంత్రులు, వైసీపీ నేతలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ.. అమరావతి రైతుల పాదయాత్రను తప్పుబడుతున్నారు. వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొంటున్నారు. రైతుల ముసుగులో టీడీపీ రియల్ ఎస్టేట్ వాళ్లు పాదయాత్ర చేస్తున్నారంటూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.
ఈ తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనాామా చేసి మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పీక కోసేందుకే అమరావతి నుండి అరసవెల్లికి యాత్ర గా వస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై నుండి కర్నూలు, కర్నూలు నుండి హైదరాబాద్ కు రాజధాని వెళితే అడ్డు చెప్పని వారు ఇప్పుడు విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డు చెబుతారా అంటూ ఫైర్ అయ్యారు.
ఏపి రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు తొక్కిపెట్టారని ఆరోపించారు ధర్మాన. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం ఉండగా, ఒకే ప్రాంతం అబివృద్ధి చెందాలని టీడీపీ భావిస్తొందనీ, ఈ క్రమంలో ఎవరిని ఆహ్వానించాలి.. ఎవరిని తిరస్కరించాలి అనే దానిపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. విశాఖ రాజధానికి అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలని ధర్మాన పిలుపునిచ్చారు.
కేసిఆర్ సర్కార్ కు షాక్ ఇస్తున్న వైఎస్ షర్మిల .. నేడు సీబీఐ డైరెక్టర్ తో భేటీ