Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానులకు ప్రజల ఆమోదం ఉందనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 85 శాతం ప్రజలు మద్దతు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
Amaravathi: లోకేష్ ఏమన్నారంటే..
“రాజధానిని మూడు ముక్కలు చేసి రైతులకు జగన్ అన్యాయం చేశారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలని కుట్రలు పన్నారు. జగన్ ఎంత తపస్సు చేసినా మూడు రాజధానులను నిర్మించలేరు. అమరావతికి కులాన్ని అంటగట్టడం జగన్ రెడ్డికే చెల్లింది” అని లోకేష్ విమర్శించారు.
ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కావాలంటే అమరావతికి బీజేపి జై కొట్టొచ్చు
నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు స్పందిస్తూ మూడు రాజధానుల నిర్మాణం వైసీపీ వల్ల అవుతుందో లేదో అనేది త్వరలోనే చూస్తారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదని టీడీపీ భావిస్తోందని కన్నబాబు విమర్శించారు. ఇదే క్రమంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపైనా కౌంటర్ ఇచ్చారు కన్నబాబు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కావాలని అనుకుంటే బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లొచ్చని అన్నారు. రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని అది ఎప్పటికీ సాధ్యం కాదని మంత్రి కన్నబాబు అన్నారు. రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొనడంతో పాటు తాను అమరావతి రైతుల పాదయాత్రలో సంఘీభావం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వ్యాఖ్యలపైనా కన్నబాబు స్పందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?