NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Karumuri Nageswara Rao: బీజేపీ ఎంపీ జీవిఎల్ విమర్శలపై ఏపి మంత్రి కారుమూరి ఘాటు రిప్లై

AP Minister Karumuri Nageswara Rao:

AP Minister Karumuri Nagasawara Rao: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉచిత బియ్యం ఏపిలో ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు చేసిన విమర్శలపై ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలోని పేదలపై బీజేపీ నేతలకు అంత ప్రేమ ఉంటే పూర్తి స్థాయిలో పేదలందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కారుమూరి. ఏపి ప్రజలపై బీజేపీ నేతలు లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం నూటికి నూరు శాతం మందికి అంటే, రాష్ట్రంలో ఉన్న 1.46 కోట్ల మంది పేదలకు నూకలు లేని నాణ్యమైన బియ్యాన్ని ఇస్తుండగా , కేంద్రం కేవలం 86 లక్షల మందికే, అది కూడా నాన్ సార్టెక్స్ బియ్యాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటుందని వివరించారు. కేవలం 60 శాతం మందికి ఇస్తూ రాష్ట్రంలోని పేదలందరినీ ఉద్ధరిస్తున్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడటం సమంజసం కాదన్నారు.

AP Minister Karumuri Nageswara Rao reply on mp gvl comments
AP Minister Karumuri Nageswara Rao reply on mp gvl comments

 

 

AP Minister Karumuri Nagasawara Rao:  కేంద్రం తీరు ఇది

కేంద్రం సరఫరా చేసే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని, అది కూడా కొంత మందికి ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం తమ వల్ల కాదని అన్నారు. వంద మంది భోజనానికి కూర్చుంటే 60 మందికి వడ్డించి మిగతా 40 మందికి మానేసే పని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చేయమంటుందనీ అది తమ వల్ల చేతకాదు అని అన్నారు. రాష్ట్రంలోని 1.46 కోట్ల పేద కుటుంబాలకు సార్టెక్స్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార అందిస్తున్నామని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ ను పెంచాలని సీఎం వైఎస్ జగన్ నీతి ఆయోగ్ కు లేఖ రాస్తే.. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులన్నీ కరెక్టుగా ఉన్నాయని, వారికి బియ్యం పంపిణీ చేయాలని కేంద్రానికి కూడా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కేంద్రం ఇప్పటి వరకూ బియ్యం విడుదల చేయలేదన్నారు మంత్రి కారుమూరి .

 

Read More: YCP MLC Anantababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టు ..? డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం

దేశంలో ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ లలో కేంద్ర ప్రభుత్వం 75 శాతం మందికి బియ్యం అందిస్తూ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 60 శాతం లోపలే పేదలకు బియ్యం ఇస్తున్నారనీ, ఇది ఏపీ పట్ల వివక్షత చూపుతున్నట్లు కాదా అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి. రాష్ట్రంలోని 1.46 కోట్ల మందికి రేషన్ ఇవ్వాలని, సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి మోడీకి లేఖ కూడా రాశారని చెెప్పిన కారుమూరి.. ఏపి ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి బీజేపీ నేతలకు ఉన్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అందరికీ బియ్యం అందేలా చూడాలని కోరారు. బీజేపీ నేతలు ముందుగా ఈ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju