NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Land Scam: రూ.250 కోట్ల విలువైన భూదందాకు ఏపి మంత్రి..?

AP Minister Land Scam: వైసీపీ ప్రభుత్వంలో పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో తరచు ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల అయితే స్వపక్షంలోని నేతలే వీటిని బయటపెడుతుండగా పలు చోట్ల ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బయటపెడుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్న నేపథ్యంలో తమకు పోటీలో ఉన్న ఎమ్మెల్యేకి మంత్రిపదవి రాకుండా చేయాలన్న భావనతో కూడా ఏదో ఒక ఆరోపణతో గాలి చేయాలని స్వపక్షీయులే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా మంత్రులుగా ఉన్న వారిపైనా ఈ సమయంలో ఆరోపణలు చేస్తే ఆయనను మంత్రి పదవి నుండి తొలగిస్తారని తద్వారా తమకు అవకాశం లభిస్తుంది అనుకున్న ఎమ్మెల్యేలు ఆ దిశగానూ పావులు కదుపుతున్నారుట.

AP Minister Land Scam
AP Minister Land Scam

ఉదయభాను తనయుడిపై ఆరోపణలు

కృష్ణాజల్లాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీనియర్ ఎమ్మెల్యే. జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానిని మంత్రివర్గం నుండి తొలగిస్తే కాపు సామాజిక వర్గ కోటాలో సామినేని ఉదయభాను మంత్రిపదవి రేసులో ఉన్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ విప్ గానూ సామినేని పని చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కోదాడ వద్ద గంజాయి రవాణా చేస్తూ కొందరు పట్టుబడితే ఆ కేసులో ఉదయభాను తనయుడు ఉన్నాడంటూ ఆరోపణలను సోషల్ మీడియాలో షికారు చేయించారు. వాస్తవానికి ఆక్కడ పట్టుబడిన వ్యక్తుల్లో సామినేని ఉదయభాను తనయుడు లేకపోయినా ఓ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారుట. ఆ వార్తల ఆధారంగా టీడీపీ నాయకులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. ఏవరో కావాలనే తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు సృష్టించారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

Read More: Cine Politics: చక్రం తిప్పిన చిరు..!? సినీ రాజకీయంతో పవన్ ఏకాకి..!!

AP Minister Land Scam:  దేవాలయ భూములపై మంత్రి కొడాలి నాని చూపు అంటూ..

ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లాలోని ఓ మంత్రి భూదందాకు తెరలేపారంటూ ఆరోపణలు వచ్చాయి. గుడివాడ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రూ.250 కోట్ల దేవాలయాల భూమిని కాజేయాలని చూస్తున్నారనీ టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. గుడివాడ శివారులోని పులివర్తి – యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలోని 25 ఎకరాల దేవాదాయ భూమిపై మంత్రి కన్ను పడిందనీ, సదరు భూమి ధర ఎకరా రూ.10 కోట్ల చొప్పున రూ.250 కోట్ల వరకూ ఉండవచ్చని పేర్కొన్నారు. దేవుడిమాన్యమైన 25 ఎకరాలకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు మాణిక్యరావు. సర్వే నెం.252 లో 15 ఎకరాలు, సర్వే నెం.294లో 5.96 ఎకరాలు, సర్వే నెం.4లో 4.83 ఎకరాలు దేవాదాయ భూమిని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిషేదిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఈ విషయంలో మంత్రి మాటలకు భయపడి అధికారులు భూమి అన్యాక్రాంతం అయ్యేందుకు సహకరిస్తే వారు ఇబ్బందులు పడతారని మాణిక్యరావు హెచ్చరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!