టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై మరో సారి మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే అమరావతి అంటూ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఏమి కోరుకుంటున్నారో టీడీపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు రోజా. అమరావతి కావాలా..? మూడు ప్రాంతాలు కావాలా..? అని చంద్రబాబు ప్రజలను అడగాలని అన్నారు.
ఇదే సందర్భంలో లోకేష్ పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేగా లోకేష్ గెలవలేడని అన్నారు. అందుకే తన తల్లి, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. లోకేష్ నోరు అదుపు పెట్టుకోకపేతే ప్రజలే కొడతారంటూ హెచ్చరించారు. అంతే కాకుండా లోకేష్ అడ్రస్ లేని వాడని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఇటీవల కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కొడాలి నాని మాటలను సమర్ధించారు. కొడాలి నాని మాట్లాడిన భాషలో తప్పేముందని ప్రశ్నించారు రోజా.
కొడాలి నాని, తాను టీడీపీ నుండే వచ్చామనీ, కానీ నాడు ఎన్టీఆర్ అభిమానులుగా టీడీపీలో ఉన్నామని తెలిపారు. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాట్లాడారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటికి వస్తే తరిమి కొడతారంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది కాబట్టే మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తొందని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా, టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు.
ముగిసిన బీఏసీ సమావేశం .. అచ్చెన్నకు బిగ్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..అది ఏమిటంటే..?