MLC Ananta babu Case: కాకినాడ లో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు ను అరెస్ట్ చేయడం జరిగిందనీ హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో నందమూరి బాలకృష్ణ నివాసంలో కాల్పుల విషయం, బోండా ఉమా కుమారుడు చేసిన ఆక్సిడెంట్, కర్నూల్ లో వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య విషయాలను ప్రస్తావించిన మంత్రి తానేటి వనిత … ఆ రోజు టీడీపీ ప్రభుత్వం హంతకుల పక్షాన నిలబడిందని విమర్శించారు. ఈ రోజు సీఎం జగన్ పేదలు, బడుగుబలహీన వర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడ్డారని పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
MLC Ananta babu Case: నిష్పక్షపాతంగా ప్రభుత్వం పని చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం
న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎంఎల్సీ అనంతబాబు ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు తానేటి వనిత. సీఎం జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్నారని చెప్పారు. న్యాయం, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మన బేధం లేకుండా తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు పై చర్యలు తీసుకోవడంతో పాటు, పేదలు, దళితుల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి మాట్లాడడానికి కూడా అర్హత లేదని అన్నారు మంత్రి తానేటి. టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ఎలాంటి న్యాయం జరుగుతోందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.కాగా కాకినాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఆనందబాబును అరెస్టు చేసినట్లు చెప్పారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనందబాబుకు వైద్య పరీక్షలు అనంతరం మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చారు.