Amalapuram: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష జరిపారు. డీజీపీతో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు పునరావృత్తం కాకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించామని మంత్రి తెలిపారు. అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండవచ్చని మంత్రి వనిత తెలిపారు. హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గతంలో ఏడుకు పైగా కేసులు ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించారనీ, వారిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే సతీష్ నివాసాలపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని మంత్రి వనిత తెలిపారు. శాసన సభ్యులు, మంత్రి గారి ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారుయ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేయడాన్ని మంత్రి ఖండించారుయ ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించారని ప్రశంసించారు. అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పోలీసులు గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ పరిస్థితులను అదుపు చేశారని మంత్రి తానేటి వనిత పోలీసుల తీరును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా వదంతులు ప్రబలకుండా ఉండేందుకు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జరిగిందని మంత్రి తెలిపారు.