ఏపి మంత్రి విడతల రజినికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మర్కాపురం సమీపంలో మంత్రి విడతల రజిని కారు ప్రమాదానికి గురైంది. మార్కాపురంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు విడతల రజిని, జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హజరైయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి విడతల రజిని కొనకనమిట్ల మండలానికి బయలుదేరారు.
ఈ క్రమంలో మార్కాపురం ఇండ్రస్టియల్ ఎస్టేట్ వద్ద కాన్వాయ్ ముందు వెళుతున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కి చెందిన ఇన్నోవా వాహనాన్ని మంత్రి ఉన్న వాహనం ఢీకొట్టింది. ఈ కారులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా మంత్రి విడతల రజిని కారు ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో మంత్రి రజిని వేరే వాహనంలో బయలుదేరి కార్యక్రమాలకు వెళ్లిపోయారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి రజిని కారు ప్రమాదానికి గురైనట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో పలువురు నేతలు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేసిఆర్ బీఆర్ఎస్ ఈసీ గుర్తింపునకు మోకాలడ్డుతున్న రేవంత్ రెడ్డి.. ఫలించేనా..?