Amalapuram violence: అమలాపురం విధ్వంసకర ఘటనలో రాజకీయ కుట్ర ఉందని వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మంత్రి విశ్వరూప్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ, జనసేన ద్వీతీయ శ్రేణి కార్యకర్తలు, రౌడీ షీటర్లు ఈ విధ్వంసంలో పాల్గొన్నారని ఆరోపణ చేసిన విశ్వరూప్ .. వైసీపీ కార్పోరేటర్ హస్తం కూడా ఉందని దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొనడం సంచలన అంశంగా మారింది. అమలాపురంలో తమ ఇంటిపై, ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై దాడి చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారన్నారు. ఆందోళనలో ధగ్ధం అయిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ కోనసీమలో అందరూ సంయమనం పాటింటాలని సూచించారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Amalapuram violence: సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారు
సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. సామరస్యంగా జరుగుతున్న ర్యాలీని రౌడీ షీటర్లు తన ఇఁటి వైపుు దారి మళ్లించారని అన్నారు. నిరసన కారులను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు విఫలమయ్యారని పేర్కొన్నారు. విధ్వంసంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ కార్యకర్తలతోనూ మాట్లాడారనీ వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఆందోళనలో పాల్గొనాలని వారు కోరినట్లు తమకు తెలిసిందన్నారు. నిరసనలో పాల్గొన్న వారి కాల్ డేటా సేకరిస్తున్నారని చెప్పారు. తన ఇంటికి నిప్పు పెట్టిన తరువాత నిరసన కారులు ఎమ్మెల్యే సతీష్ ఇంటివైపుకు వెళ్లారని, అక్కడి సమీపంలో టీడీపీ నేత ఆనందరావు గృహానికి వాళ్లు వెల్లలేదు అంటే ఆందోళనలో ఏ పార్టీ వారు పాల్గొన్నారో అర్ధం అవుతుందన్నారు మంత్రి విశ్వరూప్. తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.