టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మంత్రులు ఫైర్ అయ్యారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ పెట్టేందుకు ప్రయత్నం చేశారనీ, ఈ క్రమంలో పోలీసులు ఎంత చెప్పినా వినకుండా తన అనుచరులతో చంద్రబాబు వీరంగం సృష్టించారని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని అన్నారు. బారికేడ్లు తొలగించి పోలీసులపై టీడీపీ కార్యకర్తలు జులం చూపించారన్నారు. పోలీసుల అజ్ఞలను చంద్రబాబు దిక్కరించారని మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.
అనపర్తిలో నడిరోడ్డుపై సభ వద్దని చెప్పినా వినడం లేదన్నారు. నిబంధనలు పాటించాలి అన్నందుకు బాబు పేట్రేగిపోయారని విమర్శించారు మంత్రి చెన్నుబోయిన. జీవో నెం.1 అమలులో ఉందని హైకోర్టు చెప్పినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు తనకు ప్రత్యేక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నారని మండిపడ్డారు. నడిరోడ్డుపై సభ వద్దని అన్నందుకు చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారని అన్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జడ్ ప్లస్ కమెండోల రక్షణ ఉందని చంద్రబాబు బరితెగిస్తున్నారని దుయ్యబట్టారు. 11 మందిని బలి తీసుకున్నాక కూడా అదే ఫంథాలో వెళ్లుతున్నారని విమర్శించారు. చట్టం కన్నా తాను ఎక్కువ అని చంద్రబాబు అనుకుంటున్నారని కన్నబాబు విమర్శించారు.
చంద్రబాబు కాన్వాయ్కి అడ్డంకులు .. కాలినడకన అనపర్తికి