NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దాదాపుగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఇంకా ఓటు వేయని ఒకే ఒక వైసీపీ ఎమ్మెల్యే..ఎందుకంటే..?

ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు వైసీపీ తన నైతిక బలంతో ఏడుగురు అభ్యర్ధులను పోటికి నిలిపింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండగా పోటీకి బీసీ మహిళా అభ్యర్ధి పంచుమర్తి అనురాధను నిలపడంతో ఏకగ్రీవం అవుతాయనుకున్న వైసీపీ ఆశలకు నీళ్లు చల్లినట్లు అయ్యింది. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు పలువురు తమ అభ్యర్ధికి ఓటు వేస్తారన్న ధీమాతో టీడీపీ ఉంది.

 AP MLC Election
AP MLC Election

 

మరో పక్క ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా వైసీపీ వ్యూహాత్మకంగా ఒక్కో టీమ్ కు 22 మంది ఎమ్మెల్యేలతో ఏడు టీమ్ లను ఏర్పాటు చేసి మంత్రులకు ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది. వైసీపీకి నైతికంగా 156 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, అందులో రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి లు టీడీపీకి ఓటు వేశారని భావిస్తున్నారు. నేడు పోలింగ్ ప్రారంభానికి ముందు పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనీ, వారు అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొనడంతో క్రాస్ ఓటింగ్ పై ఊహగానాలు సాగుతున్నాయి.

panchumarti Anuradha

 

మరో పక్క పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మొదట సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆ తర్వాత మంత్రులు ఓటు హక్కు వినియోగించుకోగా, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా వచ్చి ఓట్లు వేశారు. 11 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితర టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 174 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట వరకూ ఒకే ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఎవరా ఎమ్మెల్యే అంటూ చర్చ జరిగింది.

YSRCP

ఈ తరుణంలో ఆ ఒక్క ఎమ్మెల్యే ఓటు వేయకపోవడానికి కారణం ఏమిటనే దానిపై వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని నెలిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు తన కుమారుడి వివాహ వేడుకలో ఉండటంతో ఇప్పటి వరకూ రాలేదనీ, సాయంత్రం నాలుగు గంటలలోపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలియజేశారు. వివాహ వేడుక అయిన వెంటనే ఆయన ప్రత్యేక చాపర్ లో వచ్చి ఓటు వేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష .. కానీ..

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?