AP Municipal election results: ఏపిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ తో సహా 12 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు తమ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 10 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ ఘన విజయం సాధించడం టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లు అయ్యింది.
కుప్పం, ఆకివీడు, పెనుగొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, కొండపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయఢంకా మోగించగా, ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ విజయం సాధించింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో హోరాహోరీగా ఫలితాలు వస్తున్నాయి. జగ్గయ్యపేటలో మొత్తం 31 వార్డులకు గానూ 16 వార్డుల ఫలితాలు వచ్చాయి. 8 వార్డుల్లో వైసీపీ, 8 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఇంకా 15 వార్డు ఫలితాలు రావాల్సి ఉంది. నెల్లూరు నగర పాలక సంస్థలోనూ మెజార్టీ స్థానాలో వైసీపీ లీడ్ లో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయఢంగా మోగించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు.