AP Municipal Elections 2021: ఏపిలో నెల్లూరు (Nellore) కార్పోరేషన్, 12 మున్సిపాలిటీల్లో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వకూ పోలింగ్ జరిగింది. సాయంత్రం 5గంటల వరకూ క్యూలోఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17 కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Read More: Chandra Babu: జగన్ సర్కార్పై ఇన్ని కుట్రలా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..!!
AP Municipal Elections 2021: కుప్పంలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్
కుప్పంలో ఉద్రిక్తత నడుమ పోలింగ్ ముగిసింది. ఉదయం నుండి స్థానికేతరులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ జరిగింది. స్థానికేతరుల అంశం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం, ఘర్షణలకు దారి తీశాయి. బస్సుల్లో వచ్చిన స్థానికేతరులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానికేతరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ఎన్నికలకు సంబంధించి టీడీపీ, వైసీపీ పరస్పరం ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. టీడీపీ పై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేయగా, వైసీపీపై టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, అశోక్ బాబు తదితరులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల తీరుపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నుండి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండిస్తూ ప్రతి విమర్శలు చేశారు.
కాగా సాయంత్రం 5 గంటల వరకూ నెల్లూరు కార్పోరేషన్ లో 50.1 శాతం, కుప్పంలో 76.49, బుచ్చిరెడ్డిపాలెంలో 61.6 శాతం, దాచేపల్లిలో 71.88 శాతం, గురజాలలో 71.8శాతం, ఆకివీడులో 79.74, జగ్గయ్యపేటలో 78.45, పెనుకొండలో 82.63, కమలాపురంలో 76.16, కొండపల్లిలో 66,79 రాజంపేట లో 67.27 శాతం నమోదు అయ్యింది.