AP Municipal Transfers: ఏపిలోని పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపిడీఓ ఎం వెంకటేశ్వరరావును ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా డిప్యుటేషన్ పై నియమించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒంగోలు కార్పోరేషన్ కమిషనర్ అనంతపురంకు బదిలీ
ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న కె భాగ్యలక్ష్మిని అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న పివివిఎస్ మూర్తిని అదే మున్సిపాలిటీలో ఆర్డీఎంఎగా నియమించారు. ఇక్కడ ఆర్డీఎంఏగా ఉన్న జి నాగరాజును విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ లో ఆర్డీఎంఎ నియమించారు. ఈ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో కొరకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి
Transfers and Postings G.O.Rt.No.321