AP SEC : ఏపి ఎస్ఈసీగా నీలం సాహ్ని కొద్దిసేపటి కింద బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఇటీవలే ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలను స్వీకరించారు. తొలి మహిళా ఎపి ఎస్ఈసీగా ఆమె గుర్తింపు పొందారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈసీ నీలం సాహ్నికి కమీషన్ కార్యదర్శి కన్నబాబు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ ఎస్ఈసీగా తనను ఎంపిక చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ధన్యావాదాలు తెలియజేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తామని తెలిపారు.