AP News: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవలు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రస్తుతం తెలంగాణ కంటే రోజు వారి కరోనా కేసుల నమోదు ఏపీలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పాఠశాలలకు సెలవలు పొడిగిస్తారు అని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు భావిస్తుండగా.. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పాఠశాలలకు సెలవలు ఇవ్వడం లేదని యాదవిధిగా సోమవారం నుండి తరగతులు కొనసాగుతాయని తెలిపారు మంత్రి సురేష్. మంత్రి సురేష్ ప్రకటనపై సోషల్ మీడియా లో నెటిజన్ ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పాఠశాలలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ వస్తుంది.
AP News: ఏపిలోకి కరోనా రాదట..!
ఈ సందర్బంగా ఒ నెటిజన్ వ్యంగంగా చేసిన కామెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇంతకు అతను ఏమ్మన్నాడు అంటే..? “కరోనా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే వస్తుంది. అందుకే అక్కడ సెలవులు పొడిగించారు. ఏపీ బోర్డర్ చుట్టూరా ఏ రాష్ట్రం నుండి కరోనా రాకుండా వైసిపీ జండాలు కట్టేసారు” అని పేర్కొన్నాడు.
గత ఏడాది కూడా…
గత ఏడాది కరోనా పరిస్థితుల సమయంలోనూ పరీక్షల విషయంలో చివరి వరకు విద్యార్థుల మానసిక ఆందోళనకు గురి అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో పరీక్ష లు రద్దు చేసినా.. ఏపీ పరీక్షలు నిర్వహించి తీరుతామని చివరి వరకు చెప్పి ఈ అంశం కోర్టు వరకు వెళ్లడం, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడైనా ఏకపక్షం గా నిర్ణయాలు తీసుకోకుండా కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారాలతో విద్యా శాఖ అధికారులు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.