AP Nominated Posts: వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండవ సారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల పందారం జరిగింది. కులాలు, ప్రాంతాల సమతూకం పాటిస్తూ వాటిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవులను కేటాయించారు. ఇంతకు ముందు పెద్ద ఎత్తున బీసీ ఉప కులాల కార్పోరేషన్ పాలకవర్గాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఏకంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో 135 నామినేటెడ్ పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. 76 శాతం వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అదే విధంగా 50.4 శాతం పదవులు మహిళలకు అప్పగించారు.
AP Nominated Posts: జిల్లాలు, కులాల వారీగా..
గుంటూరు జిల్లాలో మొత్తం 9 పోస్టులకు గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆరు. తూర్పు గోదావరి జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9, ప్రకాశం జిల్లాలో పది పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, కృష్ణా జిల్లాలో పది పోస్టుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అనంతపురం జిల్లాలో పది పోస్టులకు అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, విశాఖ జిల్లాలోనూ పది పదవుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, నెల్లూరు జిల్లాలో పది పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదు, విజయనగరం జిల్లాలో ఏడు పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఏడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 పదవుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆరు, కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, కర్నూలు జిల్లాలో పది పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాకు 17 నామినేటెడ్ పోస్టులు దక్కగా అత్యల్పంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏడు చొప్పున పోస్టులు దక్కాయి.