AP Police: ఏపి ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమణను పెనుగొండ డీఎస్పీగా, గుంటూరు రూరల్ ఎస్బీ డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డిని దర్శి డీఎస్పీగా, శ్రీకాళహస్తి డీఎస్పీ డీ విశ్వజిత్ ను గుంతకల్ ఎస్డీపీఓగా, కడప ట్రాఫిక్ డీఎస్పీ వి శ్రీనివాసరెడ్డిని చిత్తూరు ఎస్బీ డీఎస్పీగా, కర్నూలు ఆర్ఎస్టీఎఫ్ డీఎస్పీ జి రాజీవ్ కుమార్ ను కృష్ణ దిశ డీఎస్పీగా, వెయింటింగ్ లో డీఎస్పీ వై శ్రీనివాసరావు నెల్లూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా, నెల్లూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం వీరకుమార్ ను శ్రీకాకుళం ఎస్బీ డీఎస్పీగా, శ్రీకాకుళం ఎస్బీ డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు ను విశాఖపట్నం సిటీ నార్త్ ఎసీపీగా, వెయింటింగ్ లో ఉన్న డీఎస్పీ బి వేణుగోపాల్ తిరుమల ట్రాఫిక్ డీఎస్పీగా, ఎసీబీ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు ను విజిలెన్స్ ఇన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీగా, సీఐడీ డీఎస్పీ పి భరత్ మాతాజీ మచిలీపట్నం ట్రాఫిక్ డీఎస్పీగా, మచిలీపట్నం ట్రాఫిక్ డీఎస్పీ ఎస్ కే మసూమ్ బాషా ను మచిలీపట్నం ఎస్డీపీఓగా, వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ బి రామకృష్ణ సీఐడీ డీఎస్పీగా, వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ ఎంజేవి భాస్కరరావు ను రాజమహేంద్రవరం రూరల్ సీసీఎస్ డీఎస్పీగా, వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ అబ్దుల్ సుబాన్ ను నెల్లూరు ట్రాఫిక్ డీఎస్పీగా, నెల్లూరు ట్రాఫిక్ లో ఉన్న పి మల్లికార్జునరావును ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీగా, వెయిటింగ్ లో ఉన్న బి నాగభూషణరావు ను కర్నూలు ఏపిఎస్పీ సెకండ్ బెటాలియన్ డీఎస్పీగా, పాడేరు ఎస్డీపీఓ డాక్టర్ విబి రాజ్ కమల్ ను విశాఖపట్నం సౌత్ ఎసీపీగా, విజయవాడ సెంట్రల్ ఏసిపీ వై శ్రీనివాసరెడ్డిని డోన్ డీఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ ను ఇంటెలిజెన్స్ డీఎస్పీగా, కడప ఎస్బీ డీఎస్పీ పి శ్రీధర్ ను రాయచోటి ఎస్డీపీఓగా బదిలీ చేసారు.
Read More: Big Breaking: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం ఇదీ..!!
కాగా దర్శి డీఎస్పీ కె ప్రకాశ్ రావు, గుంతకల్లు ఎస్డీపీఓ ఎస్ షర్ఫుద్దీన్, కృష్ణా దిశ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ ఇ బాలస్వామిరెడ్డి, మచిలీపట్నం ఎస్డీపిఓ ఎం రమేష్, ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ ఎన్ సురేంద్ర, రాయచోటి ఎస్డీపీఓ వాసుదేవన్ లను మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?