ఏపీ పోలీస్ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం, సమర్ధత, నిజాయితీలో దేశంలోనే ఏపికి మొదటి స్థానం వరించింది. రాష్ట్ర డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్రం ఈ వివరాలు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో మొదటి అయిదు రాష్ట్రాల్లో ఏపి పోలీస్ శాఖ ప్రధమ స్థానంలో నిలిచిందని ఏపి పోలీస్ శాఖ వెల్లడించింది. ఇది ఏపి ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు గర్వకారణమని అభిప్రాయపడింది.
గత ఏడాది పోలీస్ శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా ఈ ఫలితాలు లభించాయని స్పష్టం చేసింది. 1.7 కోట్ల దిశ మొబైల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్లు, సాంకేతికతతో కూడిన కచ్చితమైన సాక్షాధారాలు, నేర నిరూపణతో శిక్ష పడే విధంగా దర్యాప్తు, పీపుల్స్ ప్రెండ్లీ పోలీస్.. సాంకేతికత వినియోగం ద్వారా త్వరితగతిన పోలీస్ ప్రతి స్పందన, పోలీసుల్లో క్రమశిక్షణా విధానాన్ని పెంపొందించడం ద్వారా ఏపికి ప్రశంసలు దక్కాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏపికి ప్రధామ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం వైఎస్ జగన్ లు ప్రశంసించారు.
రాష్ట్రాల వారీగా ర్యాకింగ్ లు ఇలా
పోలీసులపై ప్రజల విశ్వాసం విభాగంలో: 1. ఆంధ్రప్రదేశ్.2.తమిళనాడు. 3. తెలంగాణ. 4. గుజరాత్. 5.ఢిల్లీ
సమర్ధత విభాగంలో.. 1. ఆంధ్రప్రదేశ్. 2.తెలంగాణ. 3, గుజరాత్.4, హిమాచల్ ప్రదేశ్. 5. జార్ఖండ్
నిజాయితీ విభాగంలో .. 1. ఆంధ్రప్రదేశ్. 2. ఉత్తరాఖండ్. 3. తెలంగాణ, 4.గుజరాత్, 5.ఢిల్లీ
Nara Lokesh: కుప్పం నుండి యువగళం పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్