AP Police : ఇటీవల ఏపి పోలీసులు మానవత్వంతో అందిస్తున్న సేవలకు ప్రశంసల వర్షం కురుస్తుంది. పోలీసు శాఖ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటోంది ఏపి పోలీస్. గత నెలలో పలస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామంలో మహిళా ఎస్ఐ శిరీష మానవత్వంతో వ్యవహరించి తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఓ అనాధ శవాన్ని ఆ మహిళా ఎస్ఐ ఓ గ్రామస్తుడి సహాయంతో భుజనా వేసుకుని తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నాడు వైరల్ అయ్యాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా ఆమెను అభినందించారు.
ఇప్పుడు అదే మాదిరిగా విశాఖ జిల్లా రాంపల్లి పోలీసులు మానవత్వాన్ని చాటారు. శుక్రవారం సీతపాలెం తీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం కొట్టుకొచ్చింది. ఎస్ఐ అరుణ్ కిరణ్ కేసు నమోదు చేసి పలు స్టేషన్ లకు సమాచారం ఇచ్చారు. శనివారం వరకూ ఆ మృతదేహాం కోసం ఎవరూ రాలేదు. అప్పటికే ఆ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఆ వ్యక్తి మృతదేహాం తరలించేందుకు ఎవరూ ముందు రాకపోవడంతో స్వయంగా ఎస్ఈ అరుణ్ కిరణ్, ఎఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్శింహరావు, హోంగార్డు కొండబాబు లు కర్రల సాయంతో భుజంపై మోస్తూ తీరం నుండి సీతాపాలెేనికి తీసుకువచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. స్వయంగా ఎస్ఐ, సిబ్బంది అనాధ శవాన్ని మోసుకుంటూ తీసుకువెళుతున్న ఫోటోలను ఏపి పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మానవతా దృక్పదంతో విదులను నిర్వహించిన పోలీస్ సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు.
#DGP Gautam Sawang lauded Rambilli Police station SI & staff for going beyond their call of duty in showing their humanity & act of professionalism. (2/2) pic.twitter.com/9FaTv1v4bz
— Andhra Pradesh Police (@APPOLICE100) March 28, 2021