ఏపి andhra pradesh లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వంతో సహా వివిధ శాఖల అధికారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ జీ వో, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సంఘాలు ఎన్నికల విధులను నిర్వహించలేమంటూ వెల్లడించారు. ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం సర్క్యులర్ పై నిన్ననే హైకోర్టు high court లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరగనున్నది. మంత్రులు ఎస్ఈసీ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ state election commision (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar మాత్రం పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాలుపంచుకోలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించడంపై నిమ్మగడ్డ స్పందించారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ మేరకు ఆదివారం రెండు పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ లు సరఫరా చేస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేస్తూ ఏపి ఉద్యోగులకు ఎవరూ సాటిలేరంటూ కితాబు ఇచ్చారు. పకృతి వైపరీత్యాల సమయంలోనూ ఎంతోకష్టపడి పనిచేసిన గుర్తింపు ఏపి ఉద్యోగులకు ఉందని ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పని చేయాలని నిమ్మగడ్డ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందనీ దీనికి అందరూ సహకరించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాజ్యంగ విధిగా పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుండి రావాల్సిన నిధులు వస్తాయని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ బహిరంగ లేఖపై ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రభుత్వాన్ని కాదని ఉద్యోగ సంఘాలు ఎస్ ఈ సీకి సహకరించే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. ప్రభుత్వం కోర్టు ద్వారా అయినా ఎన్నికల ప్రక్రియను నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది, ఈ క్రమంలో ఎన్నికల షెడ్యుల్ నిలుపుదలకై సోమవారం హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?