రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కార్యాలయ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించారు. కార్యాలయంలోని జెడీ సాయి ప్రసాద్పై నిమ్మగడ్డ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్ ఈ నెల 9వ తేదీన ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవు తీసుకోరాదని అందరూ అందుబాటులో ఉండాలని ఎస్ఈసీ సూచించింది. కార్యాలయ జేడీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను ప్రభావితం చేశారనీ, దాన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపించారు.
ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా జెడీ చర్యలు ఉన్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుండి సాయిప్రసాద్ ను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆయన ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదని ఉత్తర్వులో స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?