ఆంధ్రప్రదేశ్ andhra Pradesh లో వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ CBIతో విచారణ జరిపించాలని టీడీపీ TDP నేతల బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ TDP నేతల బృందం గురువారం గవర్నర్ governor బిశ్వభూషణ్ హరిచందన్ bisvabhusan harichandan ను కలిసి కోరారు. టీడీపీ TDP నేతలు వర్ల రామయ్య , ధూళిపాళ నరేంద్ర, శ్రావణ్స ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్తో భేటీ అనంతరం వర్ల రామయ్య varla Ramaiah మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో 145 ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వర్ల రామయ్య ఆరోపించారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పడం తప్పెట్లా అవుతుందని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రుల వ్యాఖ్యలు విధ్వంసక ఘటనలను ప్రోత్సహించేలా ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు వారు తెలిపారు.