AP TET 2022: ఏపిలో నిరుద్యోగులు ఏన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఎస్సీకి సంబంధించి మొదటి అడుగు పడింది. చాలా రోజుల తర్వాత ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూన్ 15 నుండి జూలై 15 వరకూ అభ్యర్ధులు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుండి 21 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. తదుపరి ఆగస్టు 31న టెట్ పరీక్ష కీని విడుదల చేయనున్నారు. తరువాత సెప్టెంబర్ 14వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP TET 2022: ఆన్ లైన్ లోనే ధరఖాస్తులు
ఏపి టెట్ ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలను http:/aptet.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మెషన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, అన్ లైన్ పరీక్ష సూచనలను ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లోనే టెట్ కు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏపిలో డీఎస్సీ నిర్వహించక చాలా సంవత్సరాలు అయ్యింది. దాదాపు మూడేళ్ల నుండి టెట్ నిర్వహించకపోవడంతో ఈ సారి లక్షలాది మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ కల్పించనున్నారు. అదే విధంగా బీఈడీ, ఎంఈడీ అభ్యర్ధులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో అర్హత సాధించిన వారు కూడా మళ్లీ పరీక్ష రాయనున్నారు. ఇకపోతే టెట్ అర్హత సర్టిఫికెట్ కు గతంలో ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు ఉండగా, తాజాగా జీవితకాలం చెల్లుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.