Atchan Naidu : సంతబొమ్మాలి నంది విగ్రహం ఘటన విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఖాళీగా ఉండేది. కానీ ఆ తర్వాత అదే ప్రదేశంలో నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న దిమ్మపై ప్రతిష్టించడం అందరికీ తెలిసిందే.
Atchan Naidu : సంతబొమ్మాలి నంది విగ్రహం
సంతబొమ్మాలి నంది విగ్రహంఘటన విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఖాళీగా ఉండేది. కానీ ఆ తర్వాత అదే ప్రదేశంలో నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న దిమ్మపై ప్రతిష్టించడం అందరికీ తెలిసిందే. అయితే ఈ నంది విగ్రహం ఆలయ ప్రాంగణం లో కాకుండా బయట దిమ్మపై పెట్టడంతో స్థానిక వైసీపీ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక విఆర్ఓ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి 16 మంది పైన సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతా బాగానే ఉన్నా ఈ ఘటనకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లింక్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి ముందు ఈ ఆలయంలోకి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా వచ్చి ఆలయ కమిటీ సభ్యులను కలిశారట. దీంతో ఆయనపై స్థానిక వైసిపి నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా అచ్చెన్నాయుడుకు 41ఏ కింద పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఒక సామాన్యుడికి పిలుపునిచ్చినట్లు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఒక విపక్ష పార్టీకి చెందిన నాయకుడికి అలా ఎలా నోటీసులు అందజేస్తారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.